11, జూన్ 2014, బుధవారం

ప్రత్యేక తెలంగాణమా - సమైక్య ఆంధ్రమా

2001 లో KCR ప్రత్యేక తెలంగాణ కోసం రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు నాలో నేను నవ్వుకున్నాను. ఒక వ్యక్తి స్వాప్రయోజనాల కోసం, ఒక రాష్ట్ర ప్రజలను విడగొట్టాలేడను కున్నాను. నేను ఏన్నీ విధాలుగా ఆలోచించినా తెలంగాణా విభజన సామాన్యాప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్థం కాలేదు. నేను హైదరాబాద్ లో చదవటం వలన నా స్నేహితులు అందరు తెలంగాణ వల్లే వున్నారు, ఏన్నో సార్లు ఈ విషయం మీద చర్చలు జరిగేవి. నేను ఆంధ్రావాడినవ్వటం వలన నేనెప్పుడు సమైక్య వాధినే, కాని మిగతా వాళ్ళందరు తెలంగాణ వాళ్ళే, తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి వున్నారు. కాని ఈ చర్చా వాల్ల మాద్యనే ఎక్కువగా జరిగేది, ఏప్పుడు తెలంగాణ వచ్చినట్లయితే ఉద్యోగాలూ,  ఉద్యోగాఅవకాశాలు పెరుగుతాయని చెప్పటమే కాని కచ్చితంగా ఎలా పెరుగుతాయో తెలియదు. గావర్నమెంటు  ఉద్యోగాలలో అన్యాయం జరిగుతుంది అని చెప్తారే కాని, దానికి ప్రతేక రాష్టమే జవాబు కాదు. వారిలోనే సగం కన్నా ఎక్కువ సమైక్యనికే మద్దతూ పలికేవారు.

తెలంగాణకి మద్దతు ఇస్తున్నా నాయకులందరూ ఏ GO అయితే అమలు చెయ్యటం లేదో దాని అమలు కోసం ప్రయాత్నిస్తే సరిపోతుంది. కాని అది ఎవ్వరికి ఆవసరం రాలేదు. ఎందుకంటే అది అప్పుడు ఓటు బ్యాంకుని ప్రభావితం చెయ్యని విషయం. సామాన్యాప్రజనికానికి ఆ GO ఏమిటో కూడా తెలీదు, అది వారికి ఎలా ఉపయోగ పడుతుందో కూడా తెలీదు. అది తెలిసిన విద్యార్ది, ఉద్యోగ సంగాలు ప్రయత్నించి, ప్రయత్నించి విసిగి వెసారి పోయాయి, సరైన రాజకీయా మద్దతూ లేకపోవటం వలన. అదే సమయంలో TRS పార్టీ అవిర్భావం వాటికి మళ్ళి కొత్త ఉపిరీ పోశాయి. ప్రతేక రాష్టమే ఏర్పడితే GOలతొ పని ఏముందీ, ఒకవేళ ప్రతేక రాష్టము ఏర్పడక పోయినా కచ్చితంగా కొన్ని కొత్త GOలు, కొన్ని అభివృద్ధి పనులు అయితే తప్పని సరిగా జరుగుతాయనే భావానతో తెలంగాణ విద్యార్ది, ఉద్యోగ సంగాలు ఏకగ్రీవంగా తెలంగాణకి(TRS) మద్దతూ పలికినాయి. ఇది TRS పార్టికి బాగా ఉపయోగాకరంగా మారింది, తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలూవస్తాయి, ఆంధ్రావాళ్ళని అందరిని పంపిచేస్తారు (private ఉద్యోగాల నుండి కుడా) అనే బ్రమలో వున్నవారు కుడా వున్నారంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణకి(TRS) ప్రాబల్యం పెరుగుతుండటం తొ ఇతర పార్టీలు కూడా తప్పనిసరి పరిస్తితుతలలో ప్రతేక రాష్టనికే మద్దతూ పలుకుతూ తెలంగాణలో వారి పట్టుసడలి పోకుండా ఉండటానికే చుసరే కానీ పరిష్కార మార్గాల కోసం ఏ పార్టి ప్రయత్నించలేదు అన్నది కనిపిస్తున్న సత్యం. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వాఉద్యోగల పరంగాగాని, నీటి వనరుల విషయంలో కానీ అన్యాయం జరిగిందనే విషయం అందరికి తెలిసినదే, అయిన ఏ పార్టి దాని గురించి చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఎవరైనా తెలంగాణకి న్యాయం చెయ్యాలంటే వారి ఆంధ్రా ఓటు బ్యాంకుకి చిల్లు పడుతుంది.  తెలంగాణ ఉద్యమ కారణాలు తెలిసిన అన్ని పార్టీలు ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. TRS ప్రాబల్యం పెరుగుతుండటం అన్ని పార్టీలు రెండు ప్రాంతాలలోఉనికిని కాపాడుకోవటానికి మద్దతూ పలికాయి.
వారి అందరి నమ్మకం ప్రత్యేక తెలంగాణ అనేది చాల కష్టతరమైన విషయం అది ఎప్పటికి సాధ్యమవ్వధనేది అందరి నమ్మకం.

2001లో ఏర్పడిన రాష్ట్రలను పరిశిలిస్తే విడిపోయిన ప్రతీ రాష్టంకు కొత్త రాజధాని ఇవ్వబడింది మరియు ఆ ప్రాంతం వెనుక పడి వుండటం వలన కొత్త రాజధాని ఏర్పాటుకు కర్చు చేసే డబ్బూ ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ తెలంగాణ విషయంలో ఇది సాధ్యపడదు, తెలంగాణతొ హైదరాబాదుని కలిపిచుస్తే అది వెనుక పడిన ప్రాంతం కిందకి రాదు. విభజన జరిగితే అభివృద్ధి చెందినది అయిన ఆంధ్రాకి కేంద్రాప్రభుత్వం సాయం చేయ్యాలి, రాజధాని ఏర్పాటుకై. అప్పుడు తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదు. ఇలా చాల కష్టతరమైన విషయాలతో కూడినది అవ్వటం వలన అటు తెలంగాణా ప్రజలు కానీ, ఆంధ్రా ప్రజలు కానీ ప్రత్యక రాష్ట్రం గురించిన అందోళన పడలేదు. పార్టీలు అన్ని ప్రతేక రాష్టనికే మద్దతూ పలుకుతున్న ఏ ప్రాంత నాయకులు వారి వాదలు పలుకుతూ వచ్చారు.
2009లో TRS ప్రాబల్యం తగ్గుతున్నా బావనతో KCR ఆమరణ నిరాహార దీక్షతొ కేంద్రాప్రభుత్వం అనలోచక నిర్ణయం ప్రకటించటం, సిమాంద్ర ప్రజలు ఆగ్రహానికి  మళ్ళి దానిని వెన్నక్కు తీసుకోలేక శ్రీకృష్ణ కమిటికి శ్రీకారం చుట్టటం, శ్రీకృష్ణ కమిటి ఏ విదమైన స్పష్టత ఇవ్వక లేకపోవటం, మరుగునపడల్సిన విషయం, తెలంగాణ ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారి దేశంలో అందరిని ఆకర్షించింది, రాష్ట్ర స్తిథి గతుల మీద సరిగా అవగాహనా లేని రాజకీయా నాయకులందరూ వారి రాజకీయా ప్రయోజానాల కోసం కానీ, సమైక్యా ఉధ్యమం అంటూ ప్రత్యకంగా లేక పోవటం వలనా గాని,  ప్రత్యేక తెలంగాణనే మొత్తం రాష్ట్ర ప్రజలా మనోభావం అనుకోవటం వలనా కానీ, దేశం లోని అన్ని పార్టీలు  ఒక విధంగా ప్రత్యేక తెలంగాణకి మద్దతూ తెలిపుతున్నాయి.

అదికార కాంగ్రెస్ పార్టి అనలోచితంగా గాని/ రాజకీయ ప్రయోజానాల దృశ్య ఆలోచితంగాకానీ రాష్ట్ర ప్రజలను కొట్టుకు చావమని, ఎటువంటి వివరణా లేని ప్రకటనా ఇచ్చి రాష్ట్ర ప్రజలనూ అల్లకోల్లలం చేసింది. దీనిలో అనలోచితంగా అనేకన్నా ఒక కుయుక్తి తొ తీసుకొన్న నిర్ణయం అంటేనే బాగుంటుంది. అటూ సిమంధ్ర లోనూ/ ఇటూ తెలంగాణ లోనూ ప్రజలు ప్రశాంతంగా లేరు అనే చెప్పవచ్చును.
నా వరకూ ప్రారంభ దశలో నేను సమైక్య ఆంధ్రకి ప్రాధాన్యత ఇచ్చిన, పరిస్థితులలో వచ్చిన మార్పులు, ప్రభుత్వం చేసినా అనాలోచిత ప్రకటనలు, రాజకీయ కుయుక్తులు, రాష్ట్ర స్థితి గతులను చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ ఇవ్వటం మంచిది అని నా అభిప్రాయం.

ఈవి కొన్ని పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు
  • ఇన్ని ప్రకటనల తర్వాత ప్రత్యేక తెలంగాణ ఇవ్వక పోతే తెలంగాణ ప్రజలా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ఆందోళనలు ఇంకా పెరిగి రాష్ట్ర అభివృద్ది ఇంకా కుంటుపడటానికి దోహదం చేస్తాయి.
  • ఇప్పుడు ఇవ్వక పోయినా ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా పార్టీలు వున్నంతవరకూ, ఈ బందులు, దీక్షలు ఆగవు, కనుక రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుంది, ఇది మనం గత పది సంవత్సరాలుగా చూస్తూనే వున్నాము. కొన్ని పార్టీలు ఈ అంశాన్ని ముక్య అజెండాగా చేసుకొని వుండటం వలనా ఇది ఇప్పటిలో సమసిపోయే సమస్య కాదు.
  • ఇప్పుడు  ఉన్న పరిస్థితుల దృష్ట్యా సమైక్యంగా వుంచిన రెండు ప్రాంతాల అభివృద్ది కుంటుపడుతుంది.
  •  హైదరాబాదును ఉమ్మడి రాజదాని చేసినా ఆంధ్రా ప్రజలకి గాని/ తెలంగాణ ప్రజలకి గాని ఎటువంటి ఉపయోగం లేదు. ఉమ్మడి రాజదాని అంటే దానిని కేంద్రపాలితప్రాంతం (UT) గా పరిగానిస్తారు. అందు వలన దాని మీద పాలన వచ్చే ఆదాయం ముక్య బాగం కేంద్రానికి చెందుతుంది.
  • అలకాక పోయినా వచ్చిన ఆదాయం రెండు రాష్ట్రలకు పంచ బడిన, దాని వలనా హైదరాబాదు అభివృద్ది కుంటుపడుతుంది. ఎవరికి వారే హైదరాబాదుకి ప్రాదాన్యం ఇవ్వరు.
  •  హైదరాబాదును ఉమ్మడి రాజదాని చేసి దానిని  కేంద్రపాలితప్రాంతం (UT) చేసినా లేక తెలంగాణాకి ఇచ్చినా సీమాంధ్రాకి నష్టం కలుగుతుంది. పాలనా ఒక చోట ప్రజలు ఒకచోట, విభజించినా అనివార్యమైనచో ప్రత్యక  రాజదాని ఏర్పాటు చేసుకొనుట అన్ని విధాల మంచిది.
  • ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లయితే కేంద్రప్రభుత్వం ఎంతా సహాయం చేసినా ప్రస్తుతానికి సీమాంధ్రా ప్రాంతం నష్టపోవటం అనేది కాయం. కానీ సమైక్యంగా వుండి భవిషత్తులో మళ్ళి ఇదే సమస్యతో విడి పోయేకన్నా ఇప్పుడే విడిపోయి సీమాంధ్రా ప్రాంతంన్నీ అభివృద్ది చేసుకోవటం ఉత్తమం.
  • ఇప్పుడు వున్న పరిస్తితులలో సీమాంధ్రా ప్రత్యక  రాజదాని ఎక్కడా పెట్టాలి అనేది మరో చిక్కూ ప్రశ్న. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కడ పెట్టినా ఒక పూర్తి జిల్లా లోని మంచి వ్యవసాయ భూములు నాశనం అవుతాయి. ఇది పర్యావరణకి సంబంధించిన విషయం. మొత్తం ఆంధ్రాప్రాంతంలో భువిలువలు ఎక్కువ వుండటం వలనా ప్రభుత్వా భావనలకే భూములు దొరుకుట కష్టం.
  • అలా  అని కర్నూలు, అనంతపురం, చిత్తూరులోనో లేక విశాకపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోనూ అన్ని ప్రాంతాల వారికీ అమోదయోగ్యం కాదు. ముడు ప్రాంతాల వారికి ఉత్తరాంద్ర, దక్షినాంద్ర, రాయలసీమ వాళ్ళకి అమోదకరం అయిన రాజదాని ఎంచుకోవాలి. రాజధాని విస్తరణకు, పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా వుండాలి.
  • సీమాంధ్రా ప్రజలా ప్రస్తుత భయం విభజన కాన్న కొత్త రాజదాని ఎక్కడా పెడతారా అని. సీమ ప్రజలు కర్నూలు లో కావాలని, ఆంధ్రా ప్రజలు విశాకపట్నం, విజయవాడ లేక గుంటూరులోనో కావాలని కాకుండా అందరికి బాగా ఉపయోగాపడే నిర్ణయం తీసుకోవాలి.
  • సీమాంధ్రా ప్రజలు అర్ధం చేసుకోవలిసినది ఏమిటంటే సమైక్యంగా వున్న, లేకున్న నష్టపోవటం అనేది కాయం, కనుక ఇప్పుడే విడి పోయి సాద్యమైనంత త్వరగా అభివృద్ది చేసుకోవటం. ఈ సారి అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా, సాద్యమైనన్ని అన్ని పట్టణాలను అభివృద్ది చేసుకోవటం, అభివృద్ధిని  వికేంద్రీకరించటం.
  • తెలంగాణ  ప్రస్తుతానికి లబ్ది పొందినా భవిషత్తులో అభివృద్ది మందగించే సూచనలు వున్నాయి. ఎలా అనగా ఇప్పటికే రియల్ ఎస్టేటు మందగించింది. ఇప్పటివరకు హైదరాబాదులో ఎక్కువ పారిశ్రామలు వున్నది ఆంధ్ర వారికే కనుక వారు వారి పెట్టుబడులను ఆంధ్రాకి మరల్చాటానికి ప్రయత్నిస్తారు.
  • ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లయితే ఇప్పటి వరకూ తెలంగాణనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొన్న రాజకీయా పార్టీలు ఉనికి కొల్పోతాయి, వాటి ఉనికిని నిలపెట్టుకోవటానికి మరికొన్ని ప్రాంతీయ వాదా ఉద్యమాలు మొదలు పెడతాయి. అవి అభివృద్దిని అడ్డుకుంటాయి.
కావున  సీమాంద్ర ప్రజలు సమైక్య ఆంధ్రని పట్టుకు వేలాడటం వాల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా వుంది అని గమనిచాలి.
  • అధికారికంగా కేంద్రప్రభుత్వం రెండు సార్లు ప్రకటనా చేసినందున అది పూర్తిగా వెనక్కు వెళ్లలేదు. కావున హైదరాబాదే ముక్య సమస్యాగా పరిగణించి కేంద్రపాలితప్రాంతం (UT) ఉమ్మడి రాజదానిగా కానీ/ ఇంకా ఎక్కువ సంవత్సరాలు రాజదానిగా కానీ/ తెలంగాణ లో వుంచి ఉమ్మడి రాజదానిగా కానీ చేస్తుంది. దాని వలనా ఎటువంటి ఉపయోగం లేదు.
  • ఇప్పుడు  సమైక్య ఆంధ్ర కొసం కన్నా కేంద్రప్రభుత్వం నుంచి విలయినంత ఎక్కువ ప్యాకేజిని సీమంధ్ర  రాజదానిని ఏర్పాటు చేసుకోవటానికివచ్చే విధంగా కృషి చెయ్యాలి.
  • కేంద్రప్రభుత్వం నుంచి విలయినన్నీ కేంద్ర సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటయ్యే విదంగా కృషి చెయ్యాలి.. అనగా  IIT, NIT, IIM, DRDO, CSRI, CARI, BHEL, NTPC, AIIMS, central university వంటి విద్య సంస్థలు, పరిశోధన ల్యాబ్ లు ప్రభుత్వా రంగా  సంస్థలు, నౌకశ్రాయలు, విమానాశ్రయాలు మొదలైనవి.
  • విద్యుత్తు, నది జలాలు విభజన, భవిష్యతు ప్రణాళికలు, తది తర అంశాల మీద క్షున్నంగా చర్చలు జరిపి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు, అగ్రిమెంట్లు చేసుకోవాలి. 
  • రాజదాని ఏర్పాటుకి నగరం, రాయల సీమాకూ ఆంధ్రకు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు, అగ్రిమెంట్లు చేసుకోవాలి.
  •  మంచి పాలనాతో చిన్న రాష్ట్రాలు ఎక్కువ వృద్ది రేటుతొ అభివృద్ది చెందగాలవు. అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా, సాద్యమైనన్ని అన్ని పట్టణాలను అభివృద్ది చేసుకోవటం, అభివృద్ధిని  వికేంద్రీకరించటం.
 మీ
సత్భోగి
10th may 2013

1 కామెంట్‌: